పలు కుటుంబాలను పరామర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణం 19వ వార్డుకు చెందిన రామ్ శెట్టి శేషారత్నం, రాజుపాలం గ్రామానికి చెందిన బాపని కోటేశ్వరావు, అలాగే అనుపాలెం గ్రామంలో వీర్ల సాయిరాం తండ్రి వీర్ల వెంకట రమణ అనారోగ్యం కారణంగా మరణించడం జరిగినది. ఈ వార్త తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వారి పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆలాగే వారి కుటుంబం సభ్యులకు మట్టి ఖర్చు నిమిత్తం ఆర్థికంగా సహాయం అందించడం జరిగినది. అలాగే జనసేన పార్టీ మీ కుటుంబాలకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. వారితో పాటు జిల్లా ప్రధాకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి రాంబాబు, నామాల పుష్ప, షేక్ రఫీ, చిలకా పూర్ణ, చిలక సత్యం, షేక్ ఖాసిం, రాజుపాలెం మండల అధ్యక్షులు తోటా నరసయ్య, గ్రామ అధ్యక్షులు నరపుశెట్టి కోటేశ్వరరావు, చిలకా పూర్ణ, చిలక సత్యం జిల్లా నాయకులు, నాయకులు ఉన్నారు.