కమీషనర్ మల్లికార్జునను మర్యాదపూర్వకంగా కలసిన అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ అధ్వర్యంలో జనసేన నాయకులు శుక్రవారం గుంతకల్లు మున్సిపాలిటీ నూతనంగా విచ్చేసిన నూతన కమిషనర్ మల్లికార్జున ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరియు స్థానిక సమస్యల పరిష్కారం చైయల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది. వాటిలో మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ధర్మవరం & కసాపురం రైల్వే బ్రిడ్జి సమస్యలు, మరియు వివిధ ప్రాంతాలలోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ సమస్యలపై కమిషనర్ వెంటనే స్పందించి, పరిష్కరిండానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు అమీన్ సొహిల్, 1వ వార్డ్ జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్.ఎల్.బి), మైనారిటీ నాయకులు షేక్ జీలాన్ బాషా, జనసేన పార్టీ నాయకులు మారుతి కుమార్ యాదవ్, జింక రఘవవేంద్ర, కొండపల్లి శివ కుమార్, రమేష్, ఆర్.సి సురేష్ కుమార్ (ఎల్.ఎల్.బి) తదితరులు పాల్గొన్నారు.