అరెస్ట్ అయిన బాబు పాలూరు మరియు జనసైనికులకు సంగీభావం తెలిపిన జనసేన నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా: మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై మన్యం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసైనికుల.. మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టయిన జనసేన నాయకులను.. పార్వతిపురం జనసేన పార్టీ కార్యాలయంలో “జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు, మర్రాపు సురేష్, దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మిడతాన రవికుమార్ కలిసి మంగళవారం ఉదయం పరామర్శించి వారికి మద్దతు తెలపడం జరిగింది.

అనంతరం జరిగిన ఘటనపై, అక్రమంగా కేసులు పెట్టి, జనసేన నాయకులను కొట్టి, దుర్భాషలాడిన సీఐ, ఎస్.ఐ ల పై తగుచర్యలు తీసుకోవాలని.. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది..