అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి: మేకల సతీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శిరీష అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించడం జరిగింది. జనసేన పార్టీ తరఫున నాగోల్ లోని ఎస్టి హాస్టల్ లో మౌళిక సదుపాయాల కోసం విద్యార్థుల పక్షాన ధర్నా చేస్తున్న శిరీషని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎల్బీనగర్ కోఆర్డినేటర్ శిరీషని మరియు జనసైనికులను వెంటనే విడుదల చేయాలని మేకల సతీష్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.