జనసేనాని జన్మదినోత్సవాలలో భాగంగా కదిరిలో పలు సేవా కార్యక్రమాలు

కదిరి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పట్టణ ఉపాధ్యక్షులు, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల ఆధ్వర్యంలో రక్తదాన, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, పట్టణ కమిటీ సభ్యులు కిన్నెర మహేష్, గోపీనాథ్, హరీష్ వాల్మీకి, హరి బాబు, మండల కన్వీనర్ చిల్లా మహేష్, కొట్టె అశ్వర్త కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఆపదలో ఉన్న వారికి రక్తదానం, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడమే ముఖ్యంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని కదిరి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల తెలియజేశారు.