చింతపల్లి మండలంలో డా.బి.అర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు

అల్లూరి జిల్లా, చింతపల్లి మండలంలో డా.బి.అర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమజాని నిర్మించడానికి జీవితకాలం కష్టబడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి అంబేద్కర్ ఆశయాలను ఉద్దేశించి మాట్లాడుతూ చింతపల్లి మండల జనసేన నాయకులు వంతల బుజ్జిబాబు అందుకే అంబేద్కర్ అంటున్నాడు సమాజానికి ఎప్పుడైతే పూర్తిగా కులనిర్ములన అంటరానితనం నిస్పృశ్యత నిర్ములించబడుతాదో అప్పుడే సమాజానికి సమన్యాయపాలన అందుతుంది లేదంటే సమాజానికి అలానే మిగిలిపోతారు సామజిక న్యాయం సమానత్వం సాదించుకోకుంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదమని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అంటున్నారు పాలించే పాలకులు కులాలకో మతానికో వర్గానికో పాలిస్తే ఎలా రాజకీయ సాధికారత వస్తుందని వివరించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయకులు కిమ్ముడు కృష్ణమూర్తి, వంతల సందేశ్, గెమ్మేళ బాలరాజు, వంతల లక్ష్మణ్ కొర్ర భీమారాజు, సెటీ స్వామి రాజు, బాబీ పాల్గొన్నారు.