భీమాతో జనసైనికుల జీవితాలకు భరోసా

మైలవరం: జనసైనికులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమా కల్పించి వారి జీవితాలకు భరోసా కలిగించారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ)పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మారుతి కల్యాణ మండపంలో పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు భీమా కిట్లను పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ముందు చూపుతో పార్టీ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తున్న వారి కుటుంబాలకు అండగా ఉండాలని భావించి రూ.5 లక్షల వరకు భీమాను సొంత డబ్బుతో కట్టించి వారి జీవితాలకు భరోసా కల్గించారని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండు వెలకుపైగా క్రీయాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన నాయకుడు పవన్ కళ్యాణ్’ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అభ్యర్థుల విజయం కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకుముందు మైలవరం నాలుగు కూడళ్ల సెంటర్ నుండి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, జిల్లాప్రోగ్రాం కోఆర్డినేటర్ కమిటీ మైoబర్ పురమ సతీష్, ఎంపీటీసీ తేజ, మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు మురళీకృష్ణ, చిరంజీవి, ఆకుతోట ఈశ్వర్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన రామారావు, మల్లారపు దుర్గాప్రసాద్, సి.హెచ్. వెంకట కృష్ణ, ఆనం విజయ్, పసుపులేటి నాగరాజు, ఉయ్యూరు నాగరాజు, ఈతకొట్టు నాని, క్రియాశీలక సభ్యులు అన్నవరపు రమేష్, పార్టీ ఆఫీస్ మేనేజర్ రమేష్ బాబాయ్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.