పీలేరు జనసేనలో వైసిపి నుండి చేరికలు

పీలేరు నియోజకవర్గం నందు కె.వి పల్లి మండలానికి చెందిన వైసిపి నాయకులు బి.రెడ్డప్ప వారి అనుచరులతో సుమారు 50 మందితో కలసి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి దినేష్ సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రవి, కె.వి పల్లి మండల అధ్యక్షులు మహేష్, పీలేరు మండల అధ్యక్షులు మోహన్, పవన్, గజేంద్ర, హరీష్, గంగాధర్, పవన్, కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.