సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించిన అతికారి కృష్ణ

రాజంపేట, ప్రభుత్వ వైసీపీ నాయకుల ఆగడాలకు దుర్మార్గాలకు తట్టుకోలేక ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం కు చెందిన సుబ్బారావు కుటుంబీకులు ముగ్గురు బలవన్మరణానికి కారకులైన ఒంటిమిట్ట వైసిపి నాయకులు. ఈ కుటుంబానికి రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించడం జరిగినది. కృష్ణ చాలా దిగ్భ్రాంతికి గురై ఈ కుటుంబంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని ఆయన తెలియజేశారు. వీరి కుటుంబానికి అన్ని విధాల నేను అండగా ఉంటానని అన్ని సహాయ సహకారాలు నేను అందజేస్తానని ఆ కుటుంబీకులకు ధైర్యాన్ని ఆయన తెలియజేయడం జరిగినది.