జగనన్న కాలనీలలో ఆత్మకూరు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

ఆత్మకూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపట్టిన #Failure of Jagananna’s Colonies కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అనంత సాగరం మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గం, అనంత సాగరం మండలంలో 1030 చిలుకు పైగా జగనన్న కాలనీలో శాంక్షన్ చేయడం జరిగింది. పాత దేవరాయపల్లి పంచాయతీలో ఇక్కడ 61 కాలనీలో శాంక్షన్ అవ్వగా నాలుగున్నర సంవత్సరంలోనే కొన్ని బేస్ మట్టాలు, లింటల్ లెవల్ వరకు మాత్రమే పూర్తయినవి. ఇంకా కొంతమంది లబ్ధిదారులకు బిల్లులు కాక ఇబ్బంది పడుతున్నారు. జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. జగన్ రెడ్డి నవరత్నాలలో కీలక అంశం రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇల్లు అందిస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో 68 వేల ఎకరాల్లో 28 లక్షల ఇల్లు ఇస్తామన్న మాట ఏమైందని ఎద్దేవా చేసారు. ఇంకా కొన్ని పంచాయతీలో జగనన్న కాలనీలో. ఖాళీ లేవుట్ లో చెట్లు పిచ్చి మొక్కలు పెరిగి అడవుల్లాగా తయారవుతున్నాయి. నాలుగున్నర సంవత్సరంలో లబ్ధిదారులకు పూర్తిగా ఈ జగనన్న కాలనీలో అందించకపోవడం వైసిపి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.