మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మార్వోకి వినతిపత్రం ఇచ్చిన ఆత్మకూరు జనసేన

నెల్లూరు జిల్లా, రైతన్నలకు అండగా ఆత్మకూరు జనసేన పార్టీ అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం నిర్ణయించిన (16,660/-) మద్దతు ధరకు ప్రభుత్వమే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొనుగోలు చేయాలని దళారి మరియు మిల్లర్ల వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.