మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గాదె

గుంటూరు, శ్రీనివాసరావుతోటలోని గోపయ్యస్వామి సమేత శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వారం రోజులుగా జరుగున్నాయి. ఈ నేపధ్యంలో మంగళవారం మహాన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, సతీష్, కొండూరు కిషోర్, మధులాల్, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ అలా హరితో పాటు స్థానిక పెద్దలు అప్పిశెట్టి రంగా, జూపూడి రామారావు, ఓల్డ్ రామకృష్ణ (జీకే) అలా శ్రీను, మజ్జి రామకృష్ణ, నరసింహరావు, గండివలస రవికుమార్, గోపి తదితరులు మరియు జనసేన పార్టీ నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, తాడివాక రమణ, చెన్నా పోతురాజు, ఆళ్ళ హరి, ఎర్ర శ్రీను, కోనేటి ప్రసాద్, పగడాల రామకృష్ణ, అలా ప్రసాద్, శేషు, షర్ఫుద్దీన్, దాసరి రాము, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, రేజేటి శ్రీను, సెంట్రింగ్ వెంకటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. తొలుత ఆలయం ఆవరణలో జరిగిన హోమంలో పాల్గొన్నారు…ఆ తరువాత మహాన్నదాన కార్యక్రమాన్ని గాదె వెంకటేశ్వరావు ప్రారంభించారు.