పాత్రికేయులపై దాడులు శోచనీయం: దారం అనిత

మదనపల్లి: రాష్ట్రంలో పాత్రికేయులపైన దాడు రోజు రోజుకు పెరిగిపోయాయని, మదనపల్లిలో విలేఖరి వెంకశివపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దారం అనిత డిమాండ్‌ చేశారు. స్థానిక మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి భూకబ్జదారుల చేతిలో గాయపడిన వెంకట శివను జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీనివాస్, దారం హరిప్రసాద్, శంకర, స్వాతి, పురుషోత్తం, అశ్వత్థామ, శీను, సురేష్ పరామర్శించారు.

ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత రాష్టంలో పత్రికలపైన పాత్రికేయలపైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయంగా వార్తలు రాసే వెంకట శివపై వైసిపి నాయకుల దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు చేసే భూ కబ్జాలపై వార్త రాసిన వెంకట శివపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‌కేసు నమోదు చేయని పక్షంలో జనసేన తరుఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.