ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై అవగాహనా సమావేశం

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామం హరిజన పేట లో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంట నానీబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై అవగాహనా సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొని వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో, వారికీ గల 27 పథకాలను అందకుండా రద్దు చేసిందో తెలియచేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, మహిళలు, యువత, మరియు కరప మండల జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.