తాళ్లూరు మండలంలో ‘నా సేన కోసం నా వంతు’ అవగాహనా కార్యక్రమం

దర్శి నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలోని జనసేన పార్టీకి విరాళములు అందించే “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమం కోసం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు లీగల్ సెల్ సభ్యులు వరికూటి నాగరాజు సూచనల మేరకు దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండల జనసైనికులతో ఆంధ్ర ప్రగతి పినాకిని బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేవిధంగా “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్ళే విధంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.