“రసూలుపేట” ఏజెన్సీ గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కార్యక్రమం

పాలకొండ, సీతంపేట మండలంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు “రసూలుపేట” ఏజెన్సీ గ్రామంలో జనసైనికులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అలాగే జనసేన ప్రభుత్వం స్థాపించిన రోజున ఏజెన్సీ ట్రైబల్స్ ని ఆయన అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.