తులసిరెడ్డి మేనరిజమే బ్రోకరిజం: వాసగిరి మణికంఠ

*కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు భూస్థాపితం చేసినా కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనలో మార్పు రాలేదు.

గుంతకల్లు, పవన్ కళ్యాణ్ పై తులసి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ… మీ కాంగ్రెస్ పార్టీనే కదా అధికారం కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి బ్రోకరిజం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికీ మరిచిపోలేదు. పొత్తులో భాగంగా బిజెపి పెద్దలు రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్దామంటే కళ్యాణ్ గారు బ్రోకర్ ఇజం చేస్తున్నారు అంటావా, అంటే ఏదో నీకు ఎక్కడో గుచ్చుకున్నట్లు ఉందిగా తులసి రెడ్డి… నీ పార్టీనే కదా ఆరోజు పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర విభజన చేసిన రోజు నువ్వు ఎక్కడికి పోయావ్..? ఆరోజు ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్లావు..? నువ్వు ముందు చెప్పు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని రాజకీయ బ్రోకర్ అన్న నువ్వు… అన్ని రంగాల్లో బ్రోకర్… నీ మేనరిజమే బ్రోకరిజం. సొంత వేంపల్లిలో గెలవలేక రాజంపేటలో జడ్పిటిసి గా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి రాజంపేట అభివృద్ధికి పైసా పని చేయకుండా ప్రతి వర్క్ అమ్ముకున్న రియల్ బ్రోకర్. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ నీ తృణప్రాయంగా త్యజించి, కాంగ్రెస్ కు మద్దతు పలికిన రాజకీయ వ్యభిచారి అని మిమ్మల్ని అనాలని ఉంది కానీ మా నాయకుడు నేర్పిన సంస్కారం అడ్డొస్తోంది. మా నాయకుడికి మీరంటే గౌరవం ఉంది మిమ్మల్ని ఏరోజు పల్లెత్తు మాట అనలేదు అలాంటి నాయకుడి పై మీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఏదేమైనా మా నాయకుడికి బేషరతుగా మీరు క్షమాపణలు చెప్పాలని మనవి చేస్తున్నాం లేదంటే మీ బాగోతం బట్టబయలు చేయాల్సి వస్తుందని వాసగిరి మణికంఠ హెచ్చరించారు.