సింగిరిగుంట పంచాయతీలో బాబు ష్యురిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ

పుంగనూరు: “బాబు ష్యురిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా.. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ చల్లా బాబు ఆదేశాల మేరకు, పుంగనూరు టీడీపి మండల అధ్యక్షుడు మాధవ్ రెడ్డి, జనసేన అద్యక్షుడు విరుపాక్షిల ఆధ్వర్యంలో ఆదివారం పుంగనూరు మండలం, సింగిరిగుంట పంచాయతీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ వైసిపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకుని రాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో అములు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడిపి నాయకులు సి. వి రెడ్డి, కుమార్ జనసేన పుంగనూరు టౌన్ అధ్యక్షులు నరేష్, జిల్లా పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, మండల ఉపాద్యక్షుడు సుబ్బు, టీడిపి జనసేన నాయకులు హరీ నాయక్, బాలాజీ నాయక్, మురళి రాయల్, మంజు, దయాకర్, గంగాధర్, కృష్ణా నాయక్, వెంకట రమణలు పాల్గొన్నారు.