ముద్రగడ జాగ్రత్త!!.. ఎవరో వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కాపుల ద్రోహిగా మారోద్దు

  • జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్

మదనపల్లి: ఎవరో వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కాపుల ద్రోహిగా మారిన ముద్రగడ పద్మనాభం సేవా నిరతిలో శ్రీకృష్ణ దేవరాయలు వారసుడైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించడం యావత్ కాపులను దూషించడమే అని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు. ‌శనివారం మదనపల్లె టౌన్ శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ వద్ద శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి నివాళి అర్పించి, ముద్రగడ పద్మనాభానికి మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ.. కాపుల రాజ్యాధికారం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతూ దుషణలకు దిగడం దారుణమని అన్నారు.‌ కాపు రిజర్వేషన్లు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని తన రాజకీయ పబ్బం గడుపు కోవడం తప్ప సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ‌కాంగ్రెస్ పార్టీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైసిపి ప్రభుత్వం వున్నప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం మాట్లాడకుండా కేవలం లేఖలు రాస్తూ కాలం గడపడం టిడిపి ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వాలు వున్నప్పుడు ఉద్యమాలు చేసి కాపులను‌ గందరగోళంలోకి నెట్టి ఎవరో వేసిన ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోవడం ముద్రగడ పద్మనాభం నైజం అని విమర్శించారు. బలిజ, ‌కాపులను రెచ్చగొట్టే ఉద్యమాలు చేసి తుని రైలు విధ్వంసానికి కారకుడైన ముద్రగడ పద్మనాభం యావత్ కాపు, బలిజలను సమాజంలో తలెత్తుకోలేకుండా చేశాడని విమర్శించారు. కాపులను బిసిలలో చేర్చాలని ఉద్యమాలు చేసిన సమయంలో నీపు పెట్టిన ఉప్మా, భోజన ఖర్చుల కోసం మదనపల్లె నుండి రూ.5 వేలు నీకు పంపిస్తానని అన్నారు.‌ ఇప్పటి వరకూ నీవు చేసిన కాపుల బిసి రిజర్వేషన్ల అంశం కేవలం నీ రాజకీయ మనుగడ, నీవు బ్రతకడానికి తప్ప కాపులకు ఒరిగింది ఏమి లేదన్నారు.‌ కాపుల ప్రతినిధిగా‌ జనసేన పార్టీ స్థాపించి రాజ్యాధికారం కోసం ప్రజలలోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ‌ఈ కార్యక్రమంలో అడపా సురేంద్ర, గౌతమ్ జంగాల, కుమార్, రెడ్డెమ్మ, గండికోట లోకేష్ పాల్గొన్నారు.