కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి చేటు: దారం అనిత

మదనపల్లె, బలమైన ప్రతిపక్షం రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన, ప్రజల పక్షాన పోరాడుతోంది. వారసత్వ రాజకీయాలు విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పార్టీల వల్ల రాష్ట్రానికి చేటు. ఏ రంగంలోనూ వారసత్వం ఉండకూడదు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు రాజాధికారం దక్కాలన్నదే జనసేన లక్ష్యం. కుటుంబ వారసత్వ రాజకీయాల వల్ల ప్రతిభావంతులైన భవిష్యత్తు రాష్ట్రంలో దెబ్బతింటుంది. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లాలి అంటే కుటుంబ పార్టీలను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.