పాటంశెట్టి దీక్షకు చలించని అధికారులు

జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ దేవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 5వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ జిల్లా ఏ. పి.డి అదికారులు వచ్చి గతంలో వచ్చిన అధికారులు చెప్పిన విధంగానే మీరు చెప్పిన విషయాలు అన్ని పరిగణలోనికి తీసుకున్నామని.. వెంటనే మా పై అధికారులకు ప్రాథమిక నివేదిక పంపిస్తామని పాఠంశెట్టి సూర్య చంద్రకి నచ్చచెప్పడనికి చూశారు. కాని నిరహార దీక్ష 5వరోజు కు చేరుకున్నా.. ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగే విధంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. చెప్పకపోవడం గమనార్హం.