బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బ్రోచర్ రిలీజ్ చేసిన అనుశ్రీ

రాజమండ్రి సిటీ: స్థానిక లాలాచెరువులో విజయ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ మినీ సబ్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 బ్రోచర్ రిలీజ్ జరిగింది. ఈ టోర్నమెంట్ కి అనుశ్రీ సత్యనారాయణ స్పాన్సర్ షిప్ చేయడం జరిగింది. బ్యాడ్మింటన్ కోచ్ విజయ్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ ఈనెల 28 మరియు 29 తారీకుల్లో జరుగుతుందని, దీనికి అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు రావడం జరుగుతుంది. అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15, విభాగాలకి సంబంధించి బాల బాలికలు 28 మరియు 29 తారీకుల్లో పాల్గొంటారు. ఈ అండర్ 9 అండర్ 11 విభాగాలు స్టేట్లో మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో విజయ్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరగబోతుందని వచ్చే క్రీడాకారులకి, వారి తల్లిదండ్రులకు, కోచ్ లకు అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వై.వి.డి ప్రసాద్, గెడ్డం నాగరాజు, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శి విన్నా వాసు, జనసేన యువనాయకుల బయ్యపు నీడి సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ మెంబర్స్ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.