అల్లూరి సీతారామరాజు కు ఘన నివాళులు అర్పించిన డా. వంపురు గంగులయ్య

పాడేరు: అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా నియోజకవర్గంలో గలా నక్కలపుట్టు లో శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జనసేన పార్టీ (పాడేరు, అరకు పార్లమెంట్) జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య మరియు వీరమహిళ శ్రీమతి కిట్లాంగి పద్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేసిన తర్వాత మొట్టమొదటి జయంతిని పురస్కరించుకుని ఈ సందర్బంగా జనసేన పార్టీ తరుపున మేము ఆ స్వాతంత్ర్య విప్లవ వీరుడు యొక్క ఆశయాలను కొనసాగిస్తామని.. ఆదివాసీ ప్రజలను పీడిస్తున్న పలు సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని.. అందుకు మాకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజునే స్ఫూర్తి అని.. ప్రజల సమస్యలపై పోరాటమే ఆ స్వాతంత్ర విప్లవ వీరుడుకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని డా..గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నందోలి మురళి క్రిష్ణా, భూపాల్, కొర్ర కమల్ హాసన్(ఎక్సిక్యూటివ్ మెంబర్), అనిల్, అశోక్, సంతోష్, అశోక్ కుమార్, షణ్ముక్, సురేష్, కొర్ర లక్ష్మయ్య తదితర జనసైనికులు పాల్గొన్నారు.