క్రియాశీలక కార్యకర్తకు భీమా చెక్ పంపిణీ చేసిన బండారు

డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, కొత్తపేట, ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త ఏపుగంటి సత్యనారాయణకు వైద్య నిమిత్తం అయిన ఖర్చును పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 46,993/- రూపాయల చెక్కును నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు పైడికొండల నారాయణరావు, సాధనల అమ్మిరాజు, ఏపుగంటి సీతారామయ్య, గంధం శ్రీధర్, ఏపుగంటి మునేశ్వర రావు, ఏరుబండి ఏడుకొండలు, ఏరుబండి సత్యనారాయణ, పైడికొండల శేషరావు, ఏపుగంటి శ్రీను, తదితర మండల మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.