మూతపడిన బోరుని 24 గంటల్లోనే బాగుచేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు యారాడ గ్రామం, శెట్టి బలిజ సంఘం ప్రెసిడెంట్ రెడ్డి సన్యాసి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల నుంచి మంచినీళ్లు బోరు మూత పడిందని 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిస్తూ 24 గంటల్లోనే పని పూర్తి చేయించారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య చేశారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ రెడ్డి సంజయ్, తోవిటియ్య, నాగేష్, మధు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.