క్రియాశీల సభ్యునికి రూపాయలు 50,000 చెక్కును అందజేసిన బండారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం, చెముడులంక గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు రావూరి శివ మణికంఠ అయ్యప్ప ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెడికల్ భీమా క్రింద 50,000 రూపాయల చెక్కును కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్ల డేవిడ్, మడికి గ్రామ అధ్యక్షులు గంగరాజు, కొత్తపల్లి నగేష్, చెముడులంక ఎంపిటిసి తమ్మన భాస్కరరావు, బడుగువాని లంక ఎంపిటిసి పడాల అమ్మిరాజు, సలాది జయప్రకాష్ నారాయణ(జెపి), పాలూరి అర్జున్, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, పంపాన సురేష్, తమ్మన ఏసు మరియు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.