బిటి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన జనసేన కార్పొరేటర్

విశాఖపట్నం, 33వ వార్డు, దక్షిణ నియోజకవర్గంలో 18.5 లక్షల బిటి రోడ్డు (గోవింద్ రోడ్డు, నారాయణ వీధి మరియు సాయిబాబా వీధి) పనులను శంకుస్థాపన చేసిన 33వ వార్డ్ కార్పొరేటర్, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ జీవీఎంసీ భీశెట్టి వసంతలక్ష్మి. కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ మరియు జీవీఎంసీ కమీషనర్ లకు 33వ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ(జికె), వార్డ్ సెక్రటరీస్, వార్డ్ వర్క్ ఇన్స్పెక్టర్, వీర మహిళలు, జనసైనికులు మరియు వార్డు పెద్దలు పాల్గొనడం జరిగింది.