మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన బండారు శ్రీనివాస్

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం చాలా బాధాకరం మా ప్రగాఢ సానుభూతి… నివాళులు… జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు, మాజీ గవర్నర్, కొణిజేటి రోశయ్య మరణవార్త తీవ్రంగా కలచి వేసిందని, వారి అనుకోని మరణం, ఆంధ్రరాష్ట్రానికి తీవ్రమైన లోటని, ఎంతో సీనియర్ నాయకులుగా ఎన్నో పదవులు అలంకరించి, రాష్ట్ర రాజకీయాలను శాసించిన గొప్ప మేధావి అపర చాణిక్యుడు కొణిజేటి రోశయ్య అని, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, ఎవరినైనా కానీ ఎంతో ఆత్మీయతతో మాట్లాడుతూ, అసెంబ్లీలో ఎంతో చాకచక్యంగా పలు సమస్యల మీద స్పందించి, పరిష్కారం చూపిన మహా గొప్ప నాయకుడు స్వర్గీయ కొణిజేటి రోశయ్య అని, వారికి ఎవరుసాటి రాలేరని, వారికి వారే సాటి అని నిరూపించిన గొప్ప లెజెండరీ నాయకులు కొణిజేటి రోశయ్య అని, అసెంబ్లీలో ఆర్థికమంత్రిగా రాష్ట్ర చరిత్రలో 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టి, వరుసగా ఏకధాటిగా 11 సార్లు ప్రవేశపెట్టి రికార్డు స్థాయిలో నిలబడిన నేత అని, దేశంలోనే ఒక గొప్ప నేతల్లో రోశయ్య కూడా ఒకరని, ప్రముఖ జనసేన నేత బండారు శ్రీనివాసు ఈ సందర్భంగా వారిని స్మరించుకుని వారికి ఘనమైన నివాళులు జనసేన పార్టీ తరపున కొత్తపేట నియోజకవర్గ ప్రజల తరుపున, జనసేన నేతగా, రోశయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.