కన్నీటి బాధలో ఉన్న పలు కుటుంబాలను పరామర్శించిన బండారు శ్రీనివాస్!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామం నందు, ఈరోజు కొత్తపేట జనసేన పార్టీ ఇన్చార్జి, ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ పర్యటించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం మూడు కుటుంబాలకు చెందిన వారి కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి వారిని పరామర్శించి, ఓదార్పునిచ్చారు. ఈరోజు ఆలమూరు పర్యటన సందర్భంగా వారి వెంట పలువురు జనసైనికులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ ఈమధ్య స్వర్గస్తులైన వ్యక్తులు శ్రావణం వెంకన్న, కంచర్ల రామలక్ష్మి, వెచ్చా సర్వేశ్వరరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ప్రముఖ జనసేన కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, పలువురు జనసైనికులతో కలిసి పరామర్శించి, వారి కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్ రాజ్, కట్టా రాజు ఆలమూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, సలాది జయప్రకాష్ నారాయణ మూలస్థానం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలమూరు మండల జనసేన యువ నాయకులు (జెపి), ఆలమూరు మండల జనసేన సీనియర్ నాయకులు చల్లా బాబి, సిరిగినీడి పట్టాభి, పశువులేటి సాయిబాబా, దాసి మోహన, కొండేపూడి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.