కుటుంబానికి అండగా నిలిచిన బండారు శ్రీనివాస్

కుటుంబానికి అండగా నిలిచిన బండారు శ్రీనివాస్

పలివెల గ్రామం శెరిపాలెం వాసి ప్రమాదవశాత్తు మృతి చెందిన పిల్లా సర్వేశ్వరరావు, కుటుంబానికి అండగా నిలిచిన జనసేన నేత బండారు శ్రీనివాస్ !

కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని, నిలబడే వ్యక్తి జనసేన ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ అని, కొత్తపేట నియోజకవర్గంలో పలువురు ప్రజలు జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, పలివెల గ్రామానికి శివారు శెరిపాలెంనకు చెందిన పిల్లా సర్వేశ్వరరావు అనుకోని విధంగా ప్రమాదవశాత్తు మృతి చెందారని, ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన నేత బండారు శ్రీనివాస్ కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పి అండగా మేము ఉంటామని భరోసా నిచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు వారికి, అసౌకర్యం కల్పించరాదని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న పలువురు మహిళలు ప్రజలు, బండారు శ్రీనివాస్ నాయకత్వానికి సంతోషం వ్యక్తం చేస్తూ, నమ్మిన నాయకులకు కార్యకర్తలకు అండగా వచ్చి నిలబడటం చాలా గొప్ప విషయమని, ఇలాంటి నాయకులు నియోజకవర్గానికి చాలా అవసరమని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు.