పంచాయతీ నిధులను వెంటనే జమ చేయాలి

తూర్పుగోదావరి జిల్లాలో, కేంద్రం పంచాయతీలకు కేటాయించిన 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు మళ్ళించడం తగదని సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు మలికిపురం సెంటర్ లోని జాతీయ నాయకుల విగ్రహాల వద్ద మలికిపురం మండల సర్పంచ్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్రం పంచాయతీలను పటిష్ట పరిచేందుకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరలించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పంచాయతీలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు వెంటనే పంచాయతీ ఖాతాల నుండి తరలించుకు పోయిన నిధులను జమ చేయాలని, లేకుంటే నిరాహారదీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని తెలియజేసారు. వీరికి మద్దతుగా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాడి మోహన్ కుమార్ రాజోలు నియోజకవర్గంలోని 16 మంది జనసేన ఎంపిటిసిలు నాయకులు మద్దతు తెలియజేసారు.