శ్రీకాళహస్తిలో అధికార వైసిపి పార్టీ నుండి జనసేనలో బారీ చేరికలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, కందాడ పంచాయతీలో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి అధికార వైసిపి పార్టీలోని నాయకులు మునిశేఖర్ , అశ్విన్ రెడ్డి, వార్డు మెంబర్ మునిరాజ, వాలంటీర్ వినోద్, గ్రామస్థులు, మహిళలు దాదాపు 150 మందితో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా చేతులు మీదుగా పార్టీ కండువా వేసుకొని జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు అవినీతి పరులు, దోచుకున్న వారికే సీఎంగా ఒక్క అవకాశం ఇచ్చాం, ఏ అవినీతి మచ్చలేని, నిజాయితీ గల పవన్ కళ్యాణ్ కి రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, నాయకులు ఈశ్వర్, నితీష్ కుమార్, వినోద్ కుమార్, మణికంఠ, మున్నా, తేజా, సురేష్, నగేష్, లక్ష్మణ్, గురుప్రసాద్, లోక, గిరీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.