బోన్ మారో వ్యాధి బారిన పడిన చిన్నారికి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామం, బిసి సామాజిక వర్గం, నిరుపేద కుటుంబానికి చెందిన ‘రాజా భులక్ష్మి’ అనే చిన్నారి బోన్ మారో వ్యాధి బారిన పడిన విషయాన్ని తెలుసుకుని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ చిన్నారిని కలిసి ధైర్యం చెప్పి, వారి కుటుంబాన్ని ఓదార్చి తక్షణ వైద్య ఖర్చులు నిమిత్తం 10,000/₹ ఆర్థిక సహాయం చేసి, జనసేన పార్టీ తరుపున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడమే కాకుండా పాప వైద్యానికి పూర్తి సహకారం అందిస్తా అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా వెంకటేశ్వరరావు, ముత్యాల హరీష్, యెగుబంటి రమేష్, జొన్నల సూరిబాబు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.