సాలాపు లక్ష్మికి నివాళులు అర్పించిన బత్తుల బలరామకృష్ణ

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామ వాస్తవ్యులు సాలాపు చక్రవర్తి తల్లి ఈ మధ్య కాలంలో తుదిశ్వాస విడిచారు. బూరుగుపూడి జన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ బూరుగుపూడి గ్రామంలోని చక్రవర్తి నివాసానికి వెళ్లి ఆయనను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం లక్ష్మికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు చక్రి, వీరబాబు, ముని ప్రసాద్, కట్టా సూరి, రంగా అడపా ముని, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.