అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, శ్రీ దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకృష్ణపట్నం గ్రామంలో వినాయక ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను అడ్డాల దొర, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.