మండపాక శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మునగాల గ్రామానికి చెందిన కోరుకొండ మండల ప్రెసిడెంట్ మండపాక శ్రీను తండ్రి స్వర్గీయ మండపాక కామేశ్వరరావు ఇటీవల స్వర్గస్తులైనారు. ఆదివారం వారి పెదకార్యం కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణ పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, నాతిపం దొరబాబు, మట్ట వేంకటేశ్వర రావు, బోయిడి వెంకటేష్, చీకట్ల వీర్రాజు, బత్తిన వెంకన్న దొర, ముక్తేశ్వర రావు, విజయ్ కుమార్, అడబాల శ్రీను, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.