అక్రమ ఇసుక తరలింపును ఖండిస్తూ జనసేన, టిడిపిల నిరసన

రాజంపేట మండల పరిధిలోని బాలరాజు పల్లి వద్ద ఇసుక రీచ్ నందు పర్యటన చేసిన జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భహుదా నదీ పరీవాహక ప్రాంతంలో బాలరాజుపల్లి వంతెనకు ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర 50 అడుగుల లోతు మిషనరీ లతో ఇసుకను తోడి ఇతర దూరప్రాంతాలకు ప్రకృతి రిత్యా కొండలను సైతం చీల్చి ఇసుకను వందలాది వాహనాలు ద్వారా ప్రాతినిధ్యం తరలించడానికి మరీ తూములు పెట్టి మట్టితో రోడ్డు ఏర్పాటు చేసి వారి సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జీవో పేరు చెపుతూ అక్రమంగా తరలిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల అడ్డగోలు దోపిడీని తప్పుపడుతూ పలువురు జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత రామచంద్రయ్య, యన్ ఆర్ ఐ వెంకటయ్య ఓబునాథ్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.