సోడసాని గంగారావుకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం మండలం, ముక్కినాడ గ్రామ వాస్తవ్యులు సోడసాని గంగారావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ రాజమండ్రి హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పలకరించి, త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పి, వైద్యం అందిస్తున్న డాక్టర్ తో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించి, త్వరగా ఆరోగ్యం మెరుగుపడేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కవల శ్రీరామ్(ముక్కినాడ) కిమిడి శ్రీరాం, కొప్పిరెడ్డి రాజా, మోటిపల్లి మణికంఠ పాల్గొన్నారు.