గిరిజన కుటుంబాలను సందర్శించిన సర్వేపల్లి జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు శుక్రవారం ముత్తుకూరు మండలంలోని ఆదాల నగర్ కి ఆనుకొని ఉన్న పది గిరిజన కుటుంబాలను సందర్శించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పది గిరిజన కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకి కనీసం రేషన్ కార్డులు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం రేషన్ కార్డులు వారికి వాలంటీర్ ద్వారా అందించేంతవరకు ప్రతి నెల కూడా బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల కూడా వాళ్లకి బియ్యం అందించడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంకా రేషన్ కార్డు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు లేని కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి పేద గిరిజనులని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాం. త్వరితగతిన 10 గిరిజన కుటుంబాలకి రేషన్ కార్డులు అందించి వారిని ఆదుకుంటారని ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీం, పవన్, శ్రీహరి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.