పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

  • గూఢ పార్వతి 5000 ఆర్ధికసాయం
  • కొమరం వెంకటేష్ కు 10,000 ఆర్ధికసాయం

రాజానగరం, కనుపూరు గ్రామం గూఢ పార్వతి కుమారుడు (3 సంవత్సరాల వయసు) అనారోగ్య కారణంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి రూపాయలు 5000/- ఆర్ధిక సాయం చేయడం జరిగింది. అనంతరం కలవచర్ల గ్రామం కొమరం వెంకటేష్ భార్య కొమరం సూరమ్మ అనారోగ్య కారణంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి రూపాయలు 10000/- ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, బదిరెడ్డి దొర, చిట్టిప్రోలు సత్తిబాబు, అడబాల ఆదిష్ణు, వల్లభశెట్టి శంకరం, జాజిరి వెంకన్నబాబు, బండారు శ్రీను, చినమాగుల వెంకటేశ్వర్లు, నారిపిరెడ్డి భీమన్న, సాధన సుబ్బారావు, అడ్డాల అప్పన్న, చల్లా రాము, చల్లా వీరన్న, బండారు రాము, కనుపూరు జనసేన సైనికులు మరియు కలవచర్ల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.