జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆర్ధికసాయం

గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, గొరిగపూడి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మన పార్టీ క్రియాశీలక కార్యకర్త ధూళిపాళ్ల ప్రశాంత్ తన వృత్తిలో భాగంగా కరెంట్ పని చేస్తుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరి, చాలా డబ్బు అప్పు చేసి ఖర్చు పెట్టడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం ఉండి కూడా అవగాహనలేమితో సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వలేక పోయారు. అతని ఆర్థిక పరిస్థితి వేమూరు నియోజకవర్గ నాయకుడు బచ్చు పవన్ కుమార్ ద్వారా తెలుసుకున్న జేఎస్పి రాయల్ సోల్జర్స్ అధ్యక్షుడు అన్నదాసు వెంకట సుబ్బారావు (3,146) వారి గ్రూపు సభ్యులు అయిన బావిరెడ్డి రవికిషోర్(2,000), క్రొత్త శ్రీనివాస్ (1,116), బండారు రవీంద్ర కుమార్ (1,000), తాళ్లూరి పవన్ కుమార్ (1,000), పాములూరి కోటేశ్వరరావు(500), మాదాసు గోపీనాథ్(516), సూరిశెట్టి ఉపేంద్ర (1,111), అబ్బు నాగరాజు(500), సోమి ఉదయ్ కుమార్ (1,111), తోట కార్తీక్ (1,000), సూదా నాగరాజు(1,000), యడ్ల వెంకటేశ్వర రావు (1,000) ల సహకారంతో మొత్తం రూ.15,000/- సదరు క్రియాశీలక కార్యకర్త ధూళిపాళ్ల ప్రశాంత్ కి అందజేసి, అతనికి, తండ్రి లేని అతని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి, వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఎస్పి రాయల్ సోల్జర్స్ సభ్యులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.