త్రిశూల వ్యూహానికి శ్రీకారం చుట్టిన బత్తుల

  • భారీ జనసంద్రంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
  • మూడు మండలాల్లో మూడు చోట్ల అత్యంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • జనం జనం మనం.. మనం మనం బలరాముడి జన ప్రభంజనం..

రాజానగరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా.. రాజానగరం నియోజకవర్గ శాసనసభ స్థానం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న బత్తుల బలరామకృష్ణ గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని.. మూడు మండలాల్లో మూడు చోట్ల.. “త్రిశూల వ్యూహం” “జనం కోసం జనసేన” “మహా పాదయాత్ర” నేడు భారీ జనసంద్రోహంతో ప్రారంభమైంది. మహా పాదయాత్రలో భాగంగా ఆదివారం కోరుకొండ మండలం, రాజవరం గ్రామంలో.. జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టిడిపి నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.