బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జనసేనతోనే సాధ్యం: బత్తుల

రాజానగరం: 70 వ రోజు “జనంకోసం – జనసేన” మహాపాదయాత్ర కోరుకొండ మండలం, కోరుకొండ కాపవరం గ్రామంలో దళితవాడలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పర్యటించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ అరాచక ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీకి ఓటు వేసి, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ దళితులు అభ్యున్నతి జనసేన పార్టీతోనే సాధ్యమని కులాల మధ్య ఐక్యత కోసం అందరూ కృషిచేసి నవసమాజ నిర్మాణానికి పునాదులు వేసి, భావితరాలకు మంచి సమాజాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని తెలుపుతూ జనసేన పార్టీ విధివిధానాలను ముద్రించిన కరపత్రాలను పంచుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల ఆదరణతో ఈ మహా పాదయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.