పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సింగవరం గ్రామం లో ఇమ్మాన్యుయల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. అనంతరం ఆరాధన సన్నిధిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీతానగరం మండల జనసేన పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో 28 వ షష్ఠి మహోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 18 వ తేదీ వరకు జరగబోయే కబడ్డీ టోర్నమెంట్ పోస్టర్ ను జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.