చింతలమోరిలో గ్రామ గ్రామాన జనసేన-తెలుగుదేశం గ్రామస్థాయి సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం చింతలమోరి గ్రామంలో మంగళవారం జనసేన-తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ జనసేన నాయకులు రాపాక రమేష్ బాబు, జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, సఖినేటిపల్లి జనసేన మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు యుగేందర్, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసేన-టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.