శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నూతన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ మహోత్సవానికి విచ్చేసిన దైవజనులు తాళ్లూరి మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద ఆచార్యుల వారిని కలిసి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నంగిరెడ్డి విష్ణు, మేడిద వీరబాబు, కేశవ సురేష్, సాలాపు రోహిత్, యర్రంశెట్టి వీరబాబు, కె.రాజేష్, కుప్పాల సాయి, పిల్లా స్వామి, మేడిద సాయి, అడపా పండు, అడపా మునీంద్ర, మేకా రమేష్, చిరదా రమేష్, గట్టి కొండలరావు, గోగి తేజ, కట్టా సూరి, అనదాసు వీరబాబు, మదిరెడ్డి బాబులు మరియు జనసేన నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.