జనసైనికుని కుటుంబానికి అండగా నిలచిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సీతానగరం మండలం, ముగ్గళ్ల గ్రామానికి చెందిన జనసైనికుడు యెరుబండి కేశవ తండ్రి ధర్మరాజు పక్షవాతం వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకున్న.. జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి… ఖర్చుల నిమిత్తం 5,000/-ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మట్టా వెంకటేశ్వరరావు, రుద్రం కిషోర్, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, తోట అనిల్ వాసు ఇతర నాయకులు పాల్గొన్నారు.