పాముకాటుకు గురైన వ్యక్తిని పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: పాముకాటు గురై కోలుకుంటున్న రాజానగరం మండలం, యర్రంపాలెం గ్రామానికి చెందిన బావురిశెట్టి చిన్న ని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి వారి ఇంటివద్ద పరామర్శించి, కోలుకుంటున్న విధానాన్ని తెలుసుకొని, వైద్యులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తొరాటి శ్రీను, మద్దిరెడ్డి బాబులు (టైగర్) , కోనే శ్రీను, సంగుల పాండాలు, కోనే రాంబాబు, రావూరి చక్రయ్య, కన్నిశెట్టి రాజకుమార్, పెంటపాడు దండు, మన్నె గోవిందరాజు, బౌరిశెట్టి శ్రీను, క్. కృప, పుణ్యక్షేత్రం, జనసేన యూత్ మరియు యర్రంపాలెం జనసైనికులు పాల్గొన్నారు.