ప్రమాదంలో గాయపడిన మహిళను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయాలు పాలై తలకు ఫ్రాక్చర్ అయిన రాజానగరం మండలం, కానవరం గ్రామ జనసేన యువ నాయకులు అన్నందేవుల సూరిబాబు తల్లి నాగమణి ని రాజమహేంద్రవరంలో హాస్పటల్ నందు పరామర్శించిన జనసేన నాయకురాలు శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి హాస్పిటల్ కు వెళ్లి ప్రమాదం జరిగిన సంఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సూచించిన మేరకు విశ్రాంతి తీసుకోవాలని తొందర్లోనే భగవంతుడు దయతో దైనందిన జీవితంలోకి మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవన దుర్గాప్రసాద్ అడ్డాల దొరబాబు, తోట అనిల్, వాసు, పుణ్యక్షేత్రం మరియు జన సైనికులు పాల్గొన్నారు.