బొల్లెద్దుపాలెం గ్రామంలో పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో బుధవారం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. పర్యటనలో ముందుగా పుప్పాల సుబ్బారావు కు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని బొల్లెద్దుపాలెం గ్రామ జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం నేదూరి శ్రీను తండ్రి ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి 5,000/- ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం గనిక రాజేశ్వరి కు ప్రమాదవశాత్తు చేతికి గాయం అయ్యింది…గ్రామ జనసైనికులు ద్వారా విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. జి. సరోజినీ అనారోగ్యంతో బాధపడ్తున్నారనే విషయం తెలుసుకుని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేశారు.. తదనంతరం అబ్బులు తండ్రి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు. జనసైనికులు ద్వారా విషయం తెలుసుకున్న బలరామకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి 5,000/- ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కట్ట వెంకన్నబాబు, ఈ. రాజేష్ కుమార్, కట్ట పోలీస్, పులగం వీరబాబు, బెల్లాని నాగేశ్వరావు, కడిమి భార్గవ్, జనసేన సీనియర్ నాయకులు మేడిశెట్టి శివరామ్, కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, నరాల లోవరాజు, గంగిశెట్టి శాంతిబాబు, కొత్తపల్లి బుజ్జి, గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.